యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు
ABN , First Publish Date - 2022-01-21T17:21:40+05:30 IST
యువతిని మోసం చేసిన యువకుడిపై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్కు చెందిన ఓ యువతి(24) మూడేళ్లుగా మేడ్చల్లో
హైదరాబాద్/బోయిన్పల్లి: యువతిని మోసం చేసిన యువకుడిపై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్కు చెందిన ఓ యువతి(24) మూడేళ్లుగా మేడ్చల్లో ఓ ప్రైవేట్ మహిళా వసతి గృహంలో ఉంటోంది. నాలుగేళ్ల క్రితం తన సోదరి వివాహంలో ఆమెకు కరీంనగర్కు చెందిన రాజేంద్రప్రసాద్(26)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. వివాహం చేసుకుంటానని ఆమెను అతడు నమ్మించి మోసం చేశాడు. వివాహం చేసుకోమని యువతి అడిగితే దాటవేస్తున్నాడు. బాధితురాలు నిలదీస్తే పెళ్లి చేసుకోనని చెప్పాడు. మోసం చేశాడంటూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.