హైదరాబాద్ బోణీ
ABN , First Publish Date - 2021-01-13T10:31:57+05:30 IST
మిడిలార్డర్ బ్యాట్స్మన్ తిలక్ వర్మ (35 బంతుల్లో 44) సూపర్ ఇన్నింగ్స్తో హైదరాబాద్ జట్టు ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బోణీ కొట్టింది.
కోల్కతా: మిడిలార్డర్ బ్యాట్స్మన్ తిలక్ వర్మ (35 బంతుల్లో 44) సూపర్ ఇన్నింగ్స్తో హైదరాబాద్ జట్టు ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బోణీ కొట్టింది. మంగళవారం ఒడిశాతో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో గెలిచింది. 153 పరుగుల ఛేదనలో ఒడిశా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 రన్స్కే పరిమితమైౖంది. అంతకుముందు హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 34, సందీప్ 15, రాహుల్ 19 రన్స్ చొప్పున సాధించారు.