HYD: మహిళ అవయవదానం.. ముగ్గురికి పునర్జన్మ

ABN , First Publish Date - 2021-08-01T16:30:07+05:30 IST

ఓ మహిళ అవయవదానం చేయడంతో ముగ్గురికి పునర్జన్మ లభించింది. కొం డాపూర్‌ ఇజ్జత్‌నగర్‌కు చెందిన శ్రీదేవి (37) ఓ ప్రైవేట్‌ సంస్థలో హౌస్‌కిపింగ్‌

HYD: మహిళ అవయవదానం.. ముగ్గురికి పునర్జన్మ

హైదరాబాద్‌ సిటీ: ఓ మహిళ అవయవదానం చేయడంతో ముగ్గురికి పునర్జన్మ లభించింది. కొం డాపూర్‌ ఇజ్జత్‌నగర్‌కు చెందిన శ్రీదేవి (37) ఓ ప్రైవేట్‌ సంస్థలో హౌస్‌కిపింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. జూలై 27న ఆఫీసుకు వెళ్తుండగా ఆమెను గుర్తు తెలియన వాహనం ఢీకొని తీవ్ర గా యాలపాలైంది. మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో జీవన్‌దాన్‌ సభ్యులు ఆమె కుటుంబ సభ్యులకు అవయదానం గురించి అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో జూలై 29న రెండు మూత్రపిండాలు, ఒక కాలేయం సేకరించి అవసరమైన వారికి మార్పిడి చేశారు.

Updated Date - 2021-08-01T16:30:07+05:30 IST