Hyderabad: హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి

ABN , First Publish Date - 2021-10-13T15:27:18+05:30 IST

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ఏడుగురు హెడ్‌కానిస్టేబుళ్లను అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లు (ఏఎస్సైలు)గా పదోన్నతులు కల్పిస్తూ

Hyderabad:  హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ఏడుగురు హెడ్‌కానిస్టేబుళ్లను అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లు (ఏఎస్సైలు)గా పదోన్నతులు కల్పిస్తూ సీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జేవీ చౌదరి (ట్రాఫిక్‌ విభాగం), గంగాధర్‌రావు (సిటీ సెక్యూరిటీ వింగ్‌), రిషిపాల్‌ (హుస్సేనిఆలం పీఎస్‌), కుమారస్వామి (అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌), ఎం.కిష్టయ్య (గాంధీనగర్‌ పీఎస్‌), పి.సైదులు (నల్లకుంట పీఎస్‌), రామకృష్ణ (ఎస్‌బీ సిటీ) పదోన్నతులు పొందారు. మంగళవారం వారంతా నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ను కలిసిన కృతజ్ఞతలు తెలిపారు. సీపీ వారిని అభినందించారు. 

Updated Date - 2021-10-13T15:27:18+05:30 IST