బాలల రక్షక వాహనాలకు రూ.కోటి విరాళం
ABN , First Publish Date - 2021-11-10T16:14:38+05:30 IST
శిశు సంక్షేమ శాఖ బాల రక్షక వాహనాల కొనుగోలు కోసం కోటి రూపాయల చెక్కును కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్
హైదరాబాద్ సిటీ: శిశు సంక్షేమ శాఖ బాల రక్షక వాహనాల కొనుగోలు కోసం కోటి రూపాయల చెక్కును కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి మంత్రి కేటీఆర్కు అందజేశారు. ఇందులో మంత్రి మల్లారెడ్డి రూ.75 లక్షలు ఇవ్వగా, మర్రి రాజశేఖర్రెడ్డి రూ.25లక్షలు అందజేశారు. వారిని మంత్రి కేటీఆర్ అభినందించారు.