నేటి నుంచి ‘మందు’.. సోషల్‌ మీడియాలో నకిలీ జీవో..

ABN , First Publish Date - 2020-03-29T13:31:14+05:30 IST

నేటి నుంచి ‘మందు’.. సోషల్‌ మీడియాలో నకిలీ జీవో..

నేటి నుంచి ‘మందు’.. సోషల్‌ మీడియాలో నకిలీ జీవో..

హైదరాబాద్, మల్కాజిగిరి,(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆల్కాహాల్‌ అలవాటు ఉన్న వారి బాధలు అన్ని ఇన్నీ కావు. దీనిని అదనుగా తీసుకొని సోషల్‌ మీడియాలో పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. నేటి నుంచి వైన్స్‌షాపులు తెరుచుకుంటున్నట్లు ఎక్సైజ్‌ అధికారుల పేరిట విడుదలైన జీవో అంటూ సోషల్‌ మీడియాలో కొందరు వైరల్‌ చేశారు. ప్రభుత్వ జీవో కాపీని పోలినట్లే ఉండడంతో చాలా మంది నిజమేనని భావించారు. దీంతో కొందరు  వైన్స్‌ షాపుల వద్ద చక్కర్లు కొట్టడం గమనార్హం. అయితే, ఈ విషయంపై మల్కాజిగిరి ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌ సింగ్‌ను సంప్రదించగా, అందంతా ఫేక్‌ అంటూ కొట్టి పారేశారు. ఈ విషయంపై ఎక్సైజ్‌ డీఎస్పీ సైబర్‌ క్రైం పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ జీవో కాపీని పోలిన నకిలీ కాపీని తయారు చేసి వైరల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.  

Updated Date - 2020-03-29T13:31:14+05:30 IST