హైదరాబాద్ కరోనా ఉధృతితో జీహెచ్ఎంసీ అప్రమత్తం
ABN , First Publish Date - 2021-04-18T22:52:59+05:30 IST
హైదరాబాద్ కరోనా ఉధృతితో జీహెచ్ఎంసీ అప్రమత్తం
హైదరాబాద్: నగరంలో కరోనా ఉధృతితో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమైయ్యారు. జనసాంద్రత ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలతో సోడియం హైపోక్లోరైట్ స్ప్రేయింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హై రిస్క్ ప్రాంతాలల్లో ఇంటెన్సీవ్ శానిటేషన్, యాంటి లార్వా స్ప్రేయింగ్, అలాగేవచ్చే 4 రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటైజ్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది.