48 గంటలపాటు రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదు: అంజనీకుమార్
ABN , First Publish Date - 2020-12-03T18:08:59+05:30 IST
ఓల్డ్ మలక్పేట్లో 25 పోలింగ్ లొకేషన్లో, 69 పోలింగ్ స్టేషన్లో రీ పోలింగ్ జరుగుతోందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.
హైదరాబాద్: ఓల్డ్ మలక్పేట్లో 25 పోలింగ్ లొకేషన్లో, 69 పోలింగ్ స్టేషన్లో రీ పోలింగ్ జరుగుతోందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 64 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారని.. ఇప్పటి వరకు 19 శాతం పోలింగ్ పూర్తి అయిందని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. 15 కౌంటర్ సెంటర్ల వద్ద రేపు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని... కౌంటింగ్ సెంటర్ల వద్ద 200 మీటర్ల దూరం వరకు ఎవరినీ అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కేవలం అనుమతిపత్రం ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ సెంటర్ దగ్గరకు అనుమతి ఇస్తామని... అందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. 48 గంటల వరకు రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదని అంజనీకుమార్ తెలిపారు.