దర్భాంగా పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ పురోగతి

ABN , First Publish Date - 2021-07-12T15:06:36+05:30 IST

దర్భాంగా పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ పురోగతి సాధించింది. మాలిక్ సోదరులిచ్చిన సమాచారంతో ఎన్‌ఐఏ విచారణ వేగవంతం చేసింది.

దర్భాంగా పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ పురోగతి

హైదరాబాద్‌: దర్భాంగా పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ పురోగతి సాధించింది. మాలిక్ సోదరులిచ్చిన సమాచారంతో ఎన్‌ఐఏ విచారణ వేగవంతం చేసింది. జమ్ముకశ్మీర్‌లో పలుచోట్ల  సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ... ఐదుగురిని అరెస్ట్‌ చేసింది. అనంత్‌నాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ల్యాప్‌టాప్‌ను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. విధ్వంసం కుట్ర వెనుక ఎవరు ఉన్నారన్న కోణంలో ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-12T15:06:36+05:30 IST