Hyderabad: దుండిగల్‌లో వరుస హత్యలు చేస్తున్న దంపతులు అరెస్ట్

ABN , First Publish Date - 2021-07-29T16:48:47+05:30 IST

నగరంలోని పోలీసులు కళ్లు గప్పి వరుస హత్యలు చేస్తున్న దంపతులు పోలీసులకు చిక్కారు. దుండిగల్‎లో గత కొన్ని నెలల నుంచి వరుస హత్యలకు పాల్పడుతున్న దంపతులను పోలీసులు

Hyderabad: దుండిగల్‌లో వరుస హత్యలు చేస్తున్న దంపతులు అరెస్ట్

హైదరాబాద్: నగరంలో పోలీసుల కళ్లు గప్పి వరుస హత్యలు చేస్తున్న దంపతులు పోలీసులకు చిక్కారు. దుండిగల్‎లో గత కొన్ని నెలల నుంచి వరుస హత్యలకు పాల్పడుతున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన దంపతులు స్వామి, అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విచారణలో నిందితులు సంచలనమై విషయాలు బయటపెట్టారు. విచారణలో భర్త 8 హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడని, భార్య 11 హత్యలు చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈనెల 25న మల్లంపేట కూలీ అడ్డ నుంచి భామిని అనే మహిళను స్వామి తన భార్యతో కలిసి భామినిని హత్య చేసి బంగారం దోపిడీ చేశాడు. మహిళ మృతదేహాన్ని మాదారం గుట్టల్లో మహిళను పూడ్చిపెట్టినట్లు పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు.

Updated Date - 2021-07-29T16:48:47+05:30 IST