హైదరాబాద్‌ ఐటీ ఉద్యోగులు..ఊరెళ్లిపోయారు

ABN , First Publish Date - 2021-01-02T06:44:34+05:30 IST

హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌, ఐటీ ఆధారిత సేవల కంపెనీల్లోని 95 శాతానికి పైగా ఉద్యోగులు ఇంకా ఇంటి నుంచే పని (డబ్ల్యూఎ్‌ఫహెచ్‌) చేస్తున్నారని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) వెల్లడించింది. ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీసుకు రావడం (రిటర్న్‌ టు ఆఫీ్‌స-ఆర్‌టీఓ) ఈ ఏడాది మధ్య నాటికి పుంజుకోగలదని..

హైదరాబాద్‌ ఐటీ ఉద్యోగులు..ఊరెళ్లిపోయారు

అక్కడి నుంచే పని చేస్తున్నారు

క్రమక్రమంగానే ‘రిటర్న్‌ టు ఆఫీస్‌’

100% మంది మళ్లీ ఆఫీసుకు రావటం కష్టమే

హైసియా అధ్యయనంలో వెల్లడి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌, ఐటీ ఆధారిత సేవల కంపెనీల్లోని 95 శాతానికి పైగా ఉద్యోగులు ఇంకా ఇంటి నుంచే పని (డబ్ల్యూఎ్‌ఫహెచ్‌) చేస్తున్నారని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) వెల్లడించింది. ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీసుకు రావడం (రిటర్న్‌ టు ఆఫీ్‌స-ఆర్‌టీఓ) ఈ ఏడాది మధ్య నాటికి పుంజుకోగలదని.. క్రమక్రమంగా సంవత్సరాంతం నాటి కల్లా  గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు హైసియా తన అధ్యయనంలో పేర్కొంది. 90 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నప్పటికీ ఐటీ కంపెనీల్లో ఉత్పాదకత అధికంగానే ఉంది. ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగుల్లో 50 శాతం మంది వరకూ సొంత ఊరెళ్లిపోయారు. అక్కడి నుంచే పని చేస్తున్నారు. ఉద్యోగులు అనేక ప్రాంతాల నుంచి పని చేస్తున్నందున ఆర్‌టీఓ కొత్త క్లిష్టతను సంతరించుకుంది. కొవిడ్‌కు ముందున్న విధంగా  వంద శాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయడా న్ని ఇక చూడలేమని అధ్యయనంలో కంపెనీలు పేర్కొన్నాయి. 


50 శాతానికి పైగా కంపెనీల్లో : హైదరాబాద్‌ ఐటీ రంగంలోని 50 శాతానికి పైగా కంపెనీలు తమ ఉద్యోగుల్లో 25 శాతం మంది ఉద్యోగులు ఊరెళ్లి అక్కడి నుంచే పని చేస్తున్నారని వెల్లడించాయి. 25 శాతం కంపెనీల్లో 50 శాతానికి పైగా ఉద్యోగులు సొంతూళ్లలోనే ఉన్నారు. తమ ఉద్యోగుల్లో 25 శాతం మంది హైదరాబాద్‌లో లేరని 50 శాతానికి పైగా పెద్ద, అతిపెద్ద కంపెనీలు వెల్లడించాయి. కాగా ఊరెళ్లి అక్కడి నుంచే పని చేస్తున్న ఉద్యోగులు మళ్లీ హైదరాబాద్‌కు ఎప్పుడు వస్తారన్నది చెప్పడం కష్టమేనని అంటున్నాయి.


మార్చి చివరి నాటికి: ఈ ఏడాది మార్చి నాటికి 20 శాతం కంటే తక్కువ మంది ఉద్యోగులు ఆఫీసు వచ్చి పని చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలని 60 శాతం కంపెనీలు యోచిస్తున్నాయి. జూన్‌ నాటికి ఇది 40 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి పెద్ద, అతిపెద్ద ఐటీ కంపెనీల్లో కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు 50-70 శాతం ఉండవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క కంపెనీ కూడా మళ్లీ 100 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పని చేస్తారని చెప్పలేదు. 

Updated Date - 2021-01-02T06:44:34+05:30 IST