HYD: జాయింట్ ట్రాఫిక్ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న ఏ.వీ. రంగనాథ్
ABN , First Publish Date - 2021-12-29T17:58:26+05:30 IST
జాయింట్ ట్రాఫిక్ కమిషనర్గా ఏవీ రంగనాథ్ బుధవారం ఉదయం చార్జ్ తీసుకున్నారు.
హైదరాబాద్: నగర జాయింట్ ట్రాఫిక్ కమిషనర్గా ఏవీ రంగనాథ్ బుధవారం ఉదయం చార్జ్ తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ట్రాఫిక్ ఇబ్బందులపై గతంలో డీసీపీగా పని చేసిన అనుభవం ఉందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్లో గ్రీన్ ఛాలెంజ్, వీవీఐపీ మూమెంట్స్ కొరకు స్పెషల్ చర్యలు చేపడుతున్నారని అన్నారు. ప్రోటోకాల్పై హైకోర్టులో దాఖలు అయిన పిటిషన్పై ఉన్నాత అధికారులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే వాణిజ్య సముదాయాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డిసెంబర్ 31 ట్రాఫిక్ ఆంక్షలపై మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లతో పాటు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు.