ఆరంభం అదరాలని..
ABN , First Publish Date - 2020-09-21T08:38:12+05:30 IST
మహామహులైన బ్యాట్స్మెన్తో కూడిన ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ స్థాయికితగ్గ ప్రదర్శన చేస్తే ఐపీఎల్ మూడో మ్యాచ్ అభిమానులకు కనువిందే.
రాత్రి 7.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో...
బెంగళూరుతో హైదరాబాద్ ఢీ నేడు
దుబాయ్: మహామహులైన బ్యాట్స్మెన్తో కూడిన ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ స్థాయికితగ్గ ప్రదర్శన చేస్తే ఐపీఎల్ మూడో మ్యాచ్ అభిమానులకు కనువిందే. బ్యాటింగ్తోపాటు బౌలింగ్లోనూ సమతూకంగా ఉన్న ఈ జట్ల నడుమ ‘సమరమే’! ఐపీఎల్ అనగానే వార్నర్ ఎలా రెచ్చిపోతాడో తెలిసిందే. 2016లో తన నాయకత్వంలో హైదరాబాద్కు టైటిల్ సాధించి పెట్టిన వార్నర్కు మరోసారి బెయిర్స్టో తోడయ్యాడంటే ప్రత్యర్థికి ముచ్చెమటలే. వీరు గత సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్లోనే టోర్నీ చరిత్రలో మొదటి వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. డేవిడ్-స్టో మళ్లీ మెరుపులు మెరిపించడంతోపాటు విలియమ్సన్, మనీశ్ పాండే, మిచెల్ మార్ష్ కూడా సత్తా చాటితే హైదరాబాద్ భారీ స్కోరు చేయడం ఖాయం. భువనేశ్వర్ ఆధ్వర్యంలో పేస్, రషీద్ ఖాన్ నేతృత్వంలో స్పిన్ విభాగాలు ప్రత్యర్థులకు సవాల్ విసరనున్నాయి.
తుది జట్టు (అంచనా)
కోహ్లీ (కెప్టెన్), ఫించ్, పడిక్కల్, డివిల్లీర్స్ (కీపర్), శివమ్ దూబే, మొయిన్, సుందర్, మోరిస్, నవ్దీప్, చాహల్, ఉమేశ్.
ఆర్సీబీ.. బ్యాటింగే బలం
కోహ్లీ, డివిల్లీర్స్వంటి మేటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న రాయల్స్ బ్యాటింగ్ టీ20ల స్పెషలిస్ట్ అరోన్ ఫించ్ చేరికతో మరింత బలపడింది. ఇక.. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ కూడా అంచనాలను అందుకొంటే బెంగళూరుకు తిరుగుండబోదు. స్టెయిన్, ఉమేశ్ యాదవ్, సైనీలతో పేస్, చాహల్, జంపాతో స్పిన్ విభాగాలు ప్రత్యర్థుల పనిపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు..
ఒంటిచేత్తో మ్యాచ్ గతిని మార్చివేయగల ప్రమాదకర బ్యాట్స్మెన్తో కూడిన రెండు జట్లు సమరానికి సై అంటున్నాయి. సోమవారం జరిగే పోరులో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని సన్రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
తుది జట్టు (అంచనా)
వార్నర్ (కెప్టెన్), బెయిర్ స్టో, మనీశ్, విరాట్ సింగ్, విజయ్ శంకర్, నబి, రషీద్, అభిషేక్ శర్మ, భువనేశ్వర్, సందీప్ శర్మ, ఖలీల్.