Hyderabad: వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అదృశ్యం
ABN , First Publish Date - 2021-10-14T16:42:29+05:30 IST
చాంద్రాయణగుట్ట పోలీ్సస్టేష న్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అదృశ్యమయ్యారు. కేశవగిరికి చెందిన శ్రీకాంత్(35) ఆటోడ్రైవర్. ఇతను మద్యానికి
హైదరాబాద్/మదీన: చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అదృశ్యమయ్యారు. కేశవగిరికి చెందిన శ్రీకాంత్(35) ఆటోడ్రైవర్. ఇతను మద్యానికి బానిసై ఇంటికి సరిగ్గా వచ్చేవాడు కాదు. శ్రీకాంత్ తండ్రి నర్సింహతో కలిసి ఉంటున్నాడు. నర్సింహకు ఆరునెలల క్రితం పక్షవాతం వచ్చింది. నవంబర్ 2020నుంచి శ్రీకాంత్ ఇంటికి రావడంలేదు. కుటుంబసభ్యులు శ్రీకాంత్ కోసం తెలిసిన చోట వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజీవ్గాంధీనగర్లో..
బండ్లగూడ రాజీవ్గాంధీనగర్కు చెందిన ఇసాక్ అలీ కుమారుడు మహ్మద్ మునీర్ అలీ(31) ఈనెల 9న వాదియే ముస్తఫానగర్లోని తన కిరాణ దుకాణానికి వెళ్లి రాలేదు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎ్సఐ సీతాపతిరావు తెలిపారు.