హైదరాబాద్ మెట్రో వేళల్లో మరోసారి మార్పులు
ABN , First Publish Date - 2021-06-21T12:17:21+05:30 IST
తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడటంతో ప్రభుత్వం లాక్డౌన్ను ఎత్తివేసింది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడటంతో ప్రభుత్వం లాక్డౌన్ను ఎత్తివేసింది. దీంతో నగర మెట్రో వేళల్లో మరోసారి మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. మెట్రె సమయాల్లో మార్పులతో నిత్యం లక్ష మంది ప్రయాణించవచ్చని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. లాక్డౌన్లో సమయంలో ప్రతిరోజు పది వేలమంది జర్నీ చేశారు. గత ఏడాది లాక్డౌన్కి ముందు 4.5లక్షల మంది మెట్రో ప్రయాణం చేసినట్లు అధికారులు వెల్లడించారు.