కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2021-08-24T17:46:33+05:30 IST

పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజుల్లో పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేపట్టేలా చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 30లోపు పాఠశాలలలో పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై నిఘా పెట్టాలని కలెక్టర్లతో మంత్రి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-24T17:46:33+05:30 IST