HYD: ఇంట్లో నిద్రిస్తున్న యువతి...తెల్లవారేసరికి మాయం..

ABN , First Publish Date - 2021-11-16T16:16:23+05:30 IST

ఇంట్లో నిద్రపోయిన యువతి తెల్లవారేసరికి కనిపించకుండా పోయింది. చాంద్రాయణగుట్ట ఎస్‌ఐ జె.శ్రీను తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటకకు చెందిన బాబాభాను బీ అనే

HYD: ఇంట్లో నిద్రిస్తున్న యువతి...తెల్లవారేసరికి మాయం..

హైదరాబాద్/మదీన: ఇంట్లో నిద్రపోయిన యువతి తెల్లవారేసరికి కనిపించకుండా పోయింది. చాంద్రాయణగుట్ట ఎస్‌ఐ జె.శ్రీను తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటకకు చెందిన బాబాభాను బీ అనే మహిళకు భర్త లేడు. దీంతో ఆమె నలుగురు కూతుళ్లను తీసుకుని బతుకుదెరువు కోసం కొన్నేళ్ళ క్రితం నగరానికి వచ్చి హషమాబాద్‌లో నివాసముంటోంది. ఆమెతోపాటు నలుగురు కూతుళ్లు కూడా అలీనగర్‌లోని చాక్లెట్‌ కంపెనీలో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈనెల 14న తల్లి, ఒక కూతురు నైట్‌డ్యూటీకి వెళ్లగా రుక్సనా బేగం(24) మరో కూతురు ఇంట్లో నిద్రపోయారు. తెల్లవారిన తర్వాత చూడగా రుక్సానాబేగం కనిపించలేదు. ఇంట్లో ఉన్న ఫోన్‌లో చివరిసారి మాట్లాడిన నెంబర్‌కు చేయగా గోవింద్‌ కుమార్‌ అనే యువకుడు ఫోన్‌ లిఫ్ట్‌ చేసి, మాట్లాడాడు. మేమిద్దరం గుజరాత్‌ వెళ్తున్నామని చెప్పి ఫోన్‌ స్విచ్వాఫ్‌ చేశాడు. గోవింద్‌కుమార్‌ కూడా యువతి పనిచేసే చాక్లెట్‌ కంపెనీలోనే పనిచేస్తుంటాడు.తల్లి ఆదివారం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-16T16:16:23+05:30 IST