హుస్సేన్సగార్లోనే నిమజ్జనం చేస్తాం: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి
ABN , First Publish Date - 2021-09-14T19:20:37+05:30 IST
గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్లోనే చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి స్పష్టం చేసింది.
హైదరాబాద్: గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్లోనే చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి స్పష్టం చేసింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ఏబీఎన్తో మాట్లాడుతూ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు. నిమజ్జనం చేసుకోవద్దని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తారా చేయారా అనేది తెలంగాణ ప్రభుత్వం ఇష్టమన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచైనా సరే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అనాదిగా వస్తోన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. కోర్టు తీర్పులను కాదని జల్లికట్టు లాంటి పండుగలను నిర్వహిస్తున్నారని భగవంతరావు అన్నారు.