HYD: ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం
ABN , First Publish Date - 2021-09-16T17:29:25+05:30 IST
నగరంలోని ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గణేష్ నిమజ్జనం యధావిధిగా కొనసాగించాలంటూ భాగ్యనగర్ ఉత్సవ సమితి రాస్తా రోకో నిర్వహించింది.
హైదరాబాద్: నగరంలోని ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గణేష్ నిమజ్జనం యధావిధిగా కొనసాగించాలంటూ భాగ్యనగర్ ఉత్సవ సమితి రాస్తా రోకో నిర్వహించింది. ప్రభుత్వం నిమజ్జనం చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేసింది. బజరంగదళ్, వీహెచ్పీ నేతలు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు భారీగా మోహరించి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులను అరెస్ట్ చేశారు.