హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్

ABN , First Publish Date - 2021-09-17T17:27:10+05:30 IST

నగరంలోని గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్.ఓ.టి, కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్.ఓ.టి, కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ షబ్బీర్, మొహమ్మద్ ఆదిల్, షేక్ షరీఫ్ అనే నలుగురు వైజాగ్ నుండి గంజాయి తెప్పించి నగరంలో విక్రయించేందుకు యత్నించారు. పక్కా సమాచారంతో సర్దార్ పటేల్ నగర్‌లో గంజాయి సంచులతో ఉన్న నలుగురిని  పోలీసులు రెడ్ హ్యాండెడుగా పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడిన వారి నుంచి 11 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు, రూ.4,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-09-17T17:27:10+05:30 IST