Hyderabad: ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-20T15:52:24+05:30 IST

ఆర్ధిక ఇబ్బందులతో ఉరేసుకొని మహిళ మృతిచెందిన సంఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభా్‌షనగర్‌కు

Hyderabad: ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

హైదరాబాద్/పేట్‌బషీరాబాద్‌: ఆర్ధిక ఇబ్బందులతో ఉరేసుకొని మహిళ మృతిచెందిన సంఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభా్‌షనగర్‌కు చెందిన శంభూప్రసాద్‌, ఉషాదేవి(45)లు భార్యాభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల 18న రోజు మాదిరిగానే తండ్రీకొడుకులు పనికి వెళ్లగా కూతురు కాలేజీకి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉషాదేవి ఉరేసుకొని మృతిచెందింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-20T15:52:24+05:30 IST