Hyderabad: భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి
ABN , First Publish Date - 2022-01-03T16:40:09+05:30 IST
భార్య మరణాన్ని తట్టుకోలేక తాగుడుకు బానిసై భర్త మృతిచెందాడు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ ఉదయ్నగర్కు చెందిన ఫిలిప్
హైదరాబాద్/యూసు్ఫగూడ: భార్య మరణాన్ని తట్టుకోలేక తాగుడుకు బానిసై భర్త మృతిచెందాడు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ ఉదయ్నగర్కు చెందిన ఫిలిప్ డిసౌజా(58) ఎలక్ర్టీషియన్గా పనిచేస్తున్నాడు. అతడి భార్య 10 నెలల క్రితం మృతి చెందింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక డిసౌజా తాగుడుకు బానిసయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 31న మద్యం తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన ఇంటి యజమాని ఫిలిప్ సోదరుడు సావియో డిసౌజాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి ఫిలిప్ డిసౌజాను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఫిలిప్ మృతికి డిప్రెషనే కారణమని సోదరుడు సావియో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.