క్యారీ బ్యాగ్ కొనమని ఒత్తిడి చేసిన pizza outlet...
ABN , First Publish Date - 2021-11-18T18:19:45+05:30 IST
క్యారీ బ్యాగ్ కొనమని ఒత్తిడి చేసిన పిజ్జాహౌస్కు వినియోగదారుల ఫోరం జరిమానా విధించిన ఉదంతం హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది...
వినియోగదారుల ఫోరం జరిమానా
హైదరాబాద్: క్యారీ బ్యాగ్ కొనమని ఒత్తిడి చేసిన పిజ్జాహౌస్కు వినియోగదారుల ఫోరం జరిమానా విధించిన ఉదంతం హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది.హైదరాబాద్లోని పిజ్జా అవుట్లెట్ కస్టమర్ని క్యారీ బ్యాగ్ కొనమని ఒత్తిడి చేసినందుకు రూ.11,000 జరిమానాను చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. హైదరాబాద్లో తన లోగోతో కూడిన క్యారీ బ్యాగ్ను రూ.7.62కు కొనుగోలు చేయమని పిజ్జా అవుట్లెట్ ఒత్తిడి చేసింది.దీంతో కె మురళీ కుమార్ అనే విద్యార్థి పిజ్జా అవుట్లెట్పై ఫిర్యాదు చేస్తూ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.ఫిర్యాదుదారు 2019 సెప్టెంబరు 16న పిజ్జా టేక్అవేలో ఆర్డర్ చేశారు.
పిజ్జా అవుట్ లెట్ బ్రాండెడ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్కి అదనంగా రూ.7.62 వసూలు చేసింది.పిజ్జా అవుట్లెట్ క్యారీ బ్యాగ్ పేరిట అదనంగా డబ్బు వసూలు చేసి, తనను వేధించిందని మురళీకుమార్ ఆరోపించాడు. అయితే పిజ్జా అవుట్లెట్ అన్ని ఆరోపణలను ఖండించింది.రెండు సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత ఫోరమ్ వినియోగదారునికి రూ.11,000 చెల్లించాలని అవుట్లెట్ను ఆదేశించింది.