సింగరేణికాలనీ నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు

ABN , First Publish Date - 2021-09-15T02:05:59+05:30 IST

సింగరేణికాలనీ నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు

సింగరేణికాలనీ నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు

హైదరాబాద్: సైదాబాద్ పరిధి సింగరేణి కాలనీలో చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బృందాలుగా విడిపోయి రాజు కోసం గాలిస్తున్నారు. తాజాగా పోలీసులు కీలక ప్రకటన చేశారు. రాజును పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు రాజును ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మంత్రి మల్లారెడ్డి కూడా రాజును ఎన్ కౌంటర్ చేస్తామని తెలిపారు. 


కాగా ఘటన జరిగిన రోజు సాయంత్రం ఎల్బీనగర్ వద్ద మరో స్నేహితుడితో కలిసి రాజు మద్యం తాగాడు. ఆ తర్వాత బయటకు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఎల్బీనగర్ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే రాజు స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు రాజు చేసిన నేరం తెలియదన్నాడు. మద్యం తాగిన తర్వాత రాజు ఎటు వెళ్లాడో తనకు తెలియదని చెప్పాడు.


గతంలో నిందితుడు రాజుపై బైక్ దొంగతనం కేసు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి ప్రవర్తన నచ్చక భార్య వదిలేసి వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో తేలింది. నల్గొండ జిల్లాలో ఉన్న రాజు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


Updated Date - 2021-09-15T02:05:59+05:30 IST