వరద బాధితులకు డాక్టర్ ఆనంద్ బృందం సహాయం
ABN , First Publish Date - 2020-10-21T22:45:16+05:30 IST
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వైద్యులు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంద్ మిత్రబృందం సహాయక చర్యలు చేపట్టింది. తన బంజారా మహిళా ఎన్జీవో తరుపున మిత్రులు కల్యాణ్ పింగిలి, మాజిద్ సహాయ సహకారాలతో కర్మన్ ఘాట్ ప్రాంతంలో ఉంటున్న వలస కూలీల కోసం ఉచిత సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వారికి బియ్యం, కూరగాయలు తదితర నిత్యవసర వస్తువులను అందించారు. సుమారు 70 కుటుంబాలకు సైదాబాద్ సీఐ అనుదీప్, మలక్పేట్ సీఐ నాను నాయక్ చేతుల మీదుగా నిత్యవసరాలు అందజేశారు.