ఒకే బైక్‌పై ముగ్గురు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-08-05T18:09:41+05:30 IST

ఒకే బైక్‌పై ముగ్గురు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

ఒకే బైక్‌పై ముగ్గురు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర దర్వాజ వద్ద అర్ధరాత్రి వేళ ఒక ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు వేగంగా వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వాహనం అతివేగం కారణంగానే రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-08-05T18:09:41+05:30 IST