Hyderabadలో రోడ్డు ప్రమాదం...వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-11-03T14:55:44+05:30 IST

నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కరీంనగర్ రాజీవ్ రహదారి హకీంపేటలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

Hyderabadలో రోడ్డు ప్రమాదం...వ్యక్తి మృతి

హైదరాబాద్: నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కరీంనగర్ రాజీవ్ రహదారి హకీంపేటలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తుంకుంటా వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-03T14:55:44+05:30 IST