హైదరాబాద్లో పల్టీలు కొట్టిన కారు... యువకులు ఏమయ్యారంటే?
ABN , First Publish Date - 2022-01-01T17:19:20+05:30 IST
నగరంలోని వనస్థలిపురంలో పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రకేసరి నగర్లో అర్ధరాత్రి ఓ కారు పల్టీలు కొడుతూ అపార్ట్మెంట్ గోడను ఢీకొట్టింది.
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రకేసరి నగర్లో అర్ధరాత్రి ఓ కారు పల్టీలు కొడుతూ అపార్ట్మెంట్ గోడను ఢీకొట్టింది. అయితే కారులో ఉన్న యువకులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. మద్యం మత్తులో యువకులు డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ కేకుతో కారులో వెళుతుతుండగా ప్రమాదం జరిగింది. కాగా... ప్రమాదానికి కొద్ది నిముషాల ముందే మహిళలు, చిన్నారులు అపార్ట్మెంట్ లోపలికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. అక్కడి సీసీ కెమెరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కాలనీలోని ఓపెన్ ప్లేస్లో రోజూ యువత మద్యం, గంజాయి తీసుకుంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.