HYD: రైల్వేస్టేషన్‌లో యువతి అదృశ్యం

ABN , First Publish Date - 2021-08-01T15:46:54+05:30 IST

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో యువతి అదృశ్యమైంది. తమిళనాడు నవలపూర్‌ మందవిల్లి వీధికి చెందిన బాబు థామస్‌ కూతురు మినియాంగిల్‌

HYD: రైల్వేస్టేషన్‌లో యువతి అదృశ్యం

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో యువతి అదృశ్యమైంది. తమిళనాడు నవలపూర్‌ మందవిల్లి వీధికి చెందిన బాబు థామస్‌ కూతురు మినియాంగిల్‌(22) స్టాఫ్‌ నర్సు. కుటుంబ సమేతంగా తమిళనాడుకు వెళ్లేందుకు ఈనెల 29న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు వెళ్లాల్సి ఉంది. అదే సమయంలో కూతురు కనిపించలేదు. రైల్వేస్టేషన్‌ చుట్టు పక్కల ప్రాంతంలో వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రులు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రైల్వేస్టేషన్‌లోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2021-08-01T15:46:54+05:30 IST