సికింద్రాబాద్లో పగిలిన మంచినీటి పైప్లైన్
ABN , First Publish Date - 2021-03-02T18:12:55+05:30 IST
సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లి టీచర్స్ కాలనీలో మంచినీటి పైప్లైన్ పగిలింది. దీంతో దాదాపుగా గంట నుండి మంచి నీరు వృధాగా పోతున్నాయి.
హైదరాబాద్: సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లి టీచర్స్ కాలనీలో మంచినీటి పైప్లైన్ పగిలింది. దీంతో దాదాపుగా గంట నుండి మంచి నీరు వృధాగా పోతున్నాయి. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పైప్ లైన్ పగిలినట్లు తెలుస్తోంది. అండర్ గ్రౌండ్ కేబుల్ కోసం విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ సిబ్బంది భూమిని తవ్వింది. ఈ క్రమంలో పైప్లైన్కు రంధ్రం పడడంతో త్రాగునీరు వృధాగాపోతోంది. అధికారులు వెంటనే స్పందించి పైప్లైన్ను సరిచేయాల్సిందిగా కాలనీవాసులు కోరుతున్నారు.