చేతులెత్తేసిన పంజాబ్.. హైదరాబాద్ ఎదుట స్వల్ప విజయ లక్ష్యం
ABN , First Publish Date - 2020-10-25T02:59:12+05:30 IST
సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు
దుబాయ్: సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసిన పంజాబ్ ప్రత్యర్థి ఎదుట స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఆరంభం బాగానే ఉన్నా ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. దీనికి తోడు హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్తో పరుగులను అడ్డుకున్నారు.
పంజాబ్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 27, మన్దీప్ సింగ్ 17, క్రిస్ గేల్ 20, నికోలస్ పూరన్ 32 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో బ్యాట్ ఝళిపించలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.