హైదరాబాద్: రిసాలగడ్డ ట్యాంక్లో మృతదేహం
ABN , First Publish Date - 2021-12-07T22:57:07+05:30 IST
నగరంలోని రాంనగర్ డివిజన్ రిసాలగడ్డ ట్యాంక్లో మృతదేహం లభ్యమయింది. ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా వాటర్వర్క్స్ సిబ్బంది గుర్తించారు.
హైదరాబాద్: నగరంలోని రాంనగర్ డివిజన్ రిసాలగడ్డ ట్యాంక్లో మృతదేహం లభ్యమయింది. ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా వాటర్వర్క్స్ సిబ్బంది గుర్తించారు. వెంటనే వాటర్వర్క్స్ సిబ్బంది ముషీరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ముషీరాబాద్లో ఈ నెల 8, 9న నీటి సరఫరా బంద్కు పిలుపునిచ్చారు.