గోశామహల్లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ABN , First Publish Date - 2021-10-21T14:58:14+05:30 IST
నగరంలోని గోశామహల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్: నగరంలోని గోశామహల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హోం మంత్రి మహమ్మద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ ,మాజీ పోలీస్ ఉన్నతాధికారులు అమరవీరుల దినోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల నుండి హోం మంత్రి, డీజీపీ మహేందర్ రెడ్డి , టీఎస్ఎస్ఫీ అభిలాష్ బిస్తా, సీపీ అంజనీకుమార్ గౌరవ వందనం స్వీకరించారు.