HYD: లోయర్ ట్యాంక్బండ్ గణపతి దేవాలయంలో చోరీ
ABN , First Publish Date - 2021-11-26T15:02:28+05:30 IST
నగరంలోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి గల లోయర్ ట్యాంక్బండ్ గణపతి దేవాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు.
హైదరాబాద్: నగరంలోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి గల లోయర్ ట్యాంక్బండ్ గణపతి దేవాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి గుడిలోకి చొరబడి 15 వేల నగదును అపహరించాడు. ఆలయంలోని చోరీపై దేవాలయ నిర్వాహకులు గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గాంధీనగర్ క్రైమ్ పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.