HYD: బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో కొత్త కోణం

ABN , First Publish Date - 2021-12-07T19:44:25+05:30 IST

బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

HYD: బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో కొత్త కోణం

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిందితులు రోహిత్, సుమన్ మూడు పబ్‌ల్లో పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి మూడు పబ్‌ల్లో సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. పబ్ నుంచి బయటకు రాగానే ఓ హోటల్‌లో ఉండేందుకు రోహిత్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారకులైన  రోహిత్‌పై 304(2), సుమన్‌పై 109 ఐపీసీ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆక్సిడెంట్ చేసిన తర్వాత రోహిత్, సుమంత్ పోలీసుల కళ్లుగప్పి పరారవగా... పోలీసులు ఇద్దరిని వెంటాడి పట్టుకున్నారు. 


Updated Date - 2021-12-07T19:44:25+05:30 IST