HYD: నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-12-25T16:31:41+05:30 IST
నగరంలోని నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ నాగేశ్వర్ అనే రోగి మృతి చెందాడు. కాగా రోగి మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు దాడికి దిగారు. ఈఎస్ఐ ఆస్పత్రి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. బాధ్యులను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.