HYD: సెల్లార్ గుంతలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2021-12-28T16:52:44+05:30 IST

గరంలోని కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేస్‌లో సెల్లార్ గుంతలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది.

HYD: సెల్లార్ గుంతలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సాయం

హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేస్‌లో సెల్లార్ గుంతలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే కృష్ణారావు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం తరుపు ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు, అలాగే ఎమ్మెల్యే కృష్ణ  రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు వ్యక్తిగతంగా చిన్నారుల కుటుంబాలకు  మరో 3 లక్షలు అందజేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.

Updated Date - 2021-12-28T16:52:44+05:30 IST