HYD: స్కూటీపై వచ్చి చైన్ లాక్కెళ్లిన దుండగుడు
ABN , First Publish Date - 2022-01-05T16:52:12+05:30 IST
నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. చింతల్ మహేంద్ర నగర్లో 2.5 తులాల బంగారు గొలుసు చోరీ అయ్యింది.
హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. చింతల్ మహేంద్ర నగర్లో 2.5 తులాల బంగారు గొలుసు చోరీ అయ్యింది. లత అనే మహిళ గత రాత్రి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా స్కూటీపై వచ్చి దుండగుడు మహిళ మెడలో చైన్ను లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత రాత్రి కేపీహెచ్బీలో ఓ మహిళ మెడలో నాలుగు తులాల బంగారు గొలుసును చైన్ స్నాచర్లు లాక్కెళ్లిన విషయం తెలిసిందే. వరుసగా చైన్ స్నాచింగ్లు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.