హైదరాబాద్ ఆలయాల్లో వెంటాడుతన్న కోవిడ్ భయం

ABN , First Publish Date - 2021-05-05T16:04:11+05:30 IST

నగరంలోని ఆలయాల్లో కోవిడ్ భయం వెంటాడుతోంది. బల్కంపేట అమ్మవారి ఆలయంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

హైదరాబాద్ ఆలయాల్లో వెంటాడుతన్న కోవిడ్ భయం

హైదరాబాద్: నగరంలోని ఆలయాల్లో కోవిడ్ భయం వెంటాడుతోంది. బల్కంపేట అమ్మవారి ఆలయంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆలయ ఈవో అన్నపూర్ణతో పాటు మరో ముగ్గురు ప్రధాన పూజరులు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో ముఖ్యమైన సిబ్బంది మాత్రమే ఆలయ ప్రాంగణంలో ఉండేలా చర్యలు చేపట్టారు. ఆలయ సిబ్బంది వైరస్ బారిన పడటంతో ఈ నెల 14 వరకు ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు. 15న తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు.

Updated Date - 2021-05-05T16:04:11+05:30 IST