మతం పేరుతో మోదీ లబ్ది పొందాలని చూస్తున్నాడు: మధుయాష్కీ
ABN , First Publish Date - 2021-08-14T22:45:04+05:30 IST
మతం పేరుతో మోదీ లబ్ది పొందాలని చూస్తున్నాడు: మధుయాష్కీ
హైదరాబాద్: దేశంలో మోదీ మతం పేరుతో లబ్ది పొందాలని చూస్తున్నాడని కాంగ్రెస్ నేత, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ విమర్శించారు. ఈ దేశం అన్ని మతాల వారిదని, కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ లు దగాకు గురైయ్యారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్, నరేంద్రమోడీకి గులాంలా మారాడని, మైనార్టీల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని యాష్కీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం కేసీఆర్ జేబులో నుంచి పెట్టడం లేదని యాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దళిత బందు పథకం దళితులకు దొఖా చేసే పనే అని, దళితులకు ఉద్యోగాలు కావాలని, ఉపాధి కావాలని, దళిత బంధు పేరుతో పేలాలు వేసి కేసీఆర్ బిర్యానీ తింటున్నాడని యాష్కీ మండిపడ్డారు. దళితులు కేసీఆర్ వద్ద బిక్షం అడుకోవాల్సిన అవసరం లేదని, హక్కుగా వచ్చే అన్నింటినీ ప్రభుత్వము అమలు చేస్తే .. మేమే మీకు బిక్షం వేస్తామంటూ యాష్కీ అన్నారు.