టాస్ గెలిచిన హైదరాబాద్.. పంజాబ్ బ్యాటింగ్
ABN , First Publish Date - 2020-10-25T00:40:57+05:30 IST
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 43వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది
దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 43వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. హైదరాబాద్ జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. నదీమ్ ఈసారి బెంచ్కు పరిమితం కాగా, అతడి స్థానంలో ఖలీల్ జట్టులోకి వచ్చాడు. పంజాబ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మయాంక్ అగర్వాల్, జిమ్మీ నీషమ్ స్థానాల్లో మన్దీప్ సింగ్, క్రిస్ జోర్డాన్ జట్టులోకి వచ్చారు.