హైదరాబాదీ బిదారీ పరాటా

ABN , First Publish Date - 2021-07-15T18:39:21+05:30 IST

మైదా, రవ్వ, గోధుమపిండిలో ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకుని పావుగంట మూతపెట్టాలి. ఆ తరవాత పిండిని చిన్న ముద్దలుగా విభజించు కోవాలి

హైదరాబాదీ బిదారీ పరాటా

కావలసిన పదార్థాలు: మైదా- కప్పు, గోధుమ పిండి- ముప్పావు కప్పు, రవ్వ- అర కప్పు, ఉప్పు, నెయ్యి, నీళ్లు - తగినంత. 


తయారుచేసే విధానం: మైదా, రవ్వ, గోధుమపిండిలో ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకుని పావుగంట మూతపెట్టాలి. ఆ తరవాత పిండిని చిన్న ముద్దలుగా విభజించు కోవాలి. ఒక్కో ముద్దని గుండ్రంగా చిన్న రొట్టెలా వత్తాలి. దీని మీద స్పూను నెయ్యిని రాసి రెండు కొనలూ కలుపుతూ చుట్టుకోవాలి.. ఈ చుట్టని ఓసారి పిండిలో అద్ది పూరీలా వత్తాలి. దీన్ని బాణలిమీద రెండు వైపులా నెయ్యి వేస్తూ ఎర్రగా కాలిస్తే హైదరాబాదీ బిదారీ పరాటా తయారు. మొత్తం ముద్దలన్నీ ఇలాగే వత్తుకొని కాల్చాలి.

Updated Date - 2021-07-15T18:39:21+05:30 IST