ఆంధ్రా సెటిలర్లే గెలిపించారు: హైదర్ నగర్ విజేత నార్నే

ABN , First Publish Date - 2020-12-04T22:14:55+05:30 IST

నగరంలోని హైదర్ నగర్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నార్నే శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. 2010 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు.

ఆంధ్రా సెటిలర్లే గెలిపించారు: హైదర్ నగర్ విజేత నార్నే

హైదరాబాద్: నగరంలోని హైదర్ నగర్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నార్నే శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. 2010 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు గెలుపు సంబరాల్లో మునిగితేలారు. ఏబీఎన్‌తో మాట్లాడిన ఆయన .. తన విజయానందాన్ని పంచుకున్నారు. తనపై నమ్మకం పెట్టి గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రచారంలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై దృష్టి పెడతానన్నారు. కులమతాలకు, ప్రాంతలకు అతీతంగా తనకు ఓట్లు వేశారన్నారు. ఆంధ్రా సెటిలర్లే తనను గెలిపించారన్న ఆయన.. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-12-04T22:14:55+05:30 IST