హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2021-10-17T09:38:33+05:30 IST

రాష్ట్ర హైకోర్టుకు నూతన న్యాయమూర్తులుగా నియమితులైన పెరుగు శ్రీసుధ, డాక్టర్‌ చిల్లకూరు సుమలత, డాక్టర్‌ గురిజాల రాధారాణి, మున్నూరి లక్ష్మణ్‌, ఎన్‌. తుకారాంజీ, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, పటోళ్ల మాధవీదేవి శుక్రవారం ప్రమాణం చేశారు.

హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టుకు నూతన న్యాయమూర్తులుగా నియమితులైన పెరుగు శ్రీసుధ, డాక్టర్‌ చిల్లకూరు సుమలత, డాక్టర్‌ గురిజాల రాధారాణి, మున్నూరి లక్ష్మణ్‌, ఎన్‌. తుకారాంజీ, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, పటోళ్ల మాధవీదేవి శుక్రవారం ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ వారిచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-17T09:38:33+05:30 IST