నా విజన్‌ నిజమైనందుకు గర్వంగా ఉంది: టీడీపీ అధినేత చంద్రబాబు

ABN , First Publish Date - 2020-11-28T08:47:49+05:30 IST

‘‘హైదరాబాద్‌ను బయోటెక్‌ కేంద్రంగా మలచాలని మూడు దశాబ్దాల కిందట జెనోమ్‌ వ్యాలీకి అంకురార్పణ చేశా.

నా విజన్‌ నిజమైనందుకు గర్వంగా ఉంది: టీడీపీ అధినేత చంద్రబాబు

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌ను బయోటెక్‌ కేంద్రంగా మలచాలని మూడు దశాబ్దాల కిందట జెనోమ్‌ వ్యాలీకి అంకురార్పణ చేశా. నా విజన్‌ నిజమైనందుకు గర్వంగా ఉంది. ప్రధాని  వచ్చి భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ ఏ దశలో ఉందో సమీక్షించడం ఆనందించే విషయం’’ అని టీడీపి అధి నేత చంద్రబాబు పేర్కొన్నారు.


ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్‌లోని జెనోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని సందర్శించనున్న నేపఽథ్యంలో ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు.    అన్ని అవరోధాలు అధిగమించి భారత్‌ బయోటెక్‌ కంపెనీ వ్యాక్సిన్‌ను అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తుందని ఆకాంక్షించారు. 


Updated Date - 2020-11-28T08:47:49+05:30 IST