బాగా కోలుకుంటున్నాను : రాష్ట్రపతి కోవింద్

ABN , First Publish Date - 2021-04-01T22:55:25+05:30 IST

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం వైద్యులకు ధన్యవాదాలు

బాగా కోలుకుంటున్నాను : రాష్ట్రపతి కోవింద్

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత తాను బాగా కోలుకుంటున్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు, ప్రజలు తనకు పంపించిన సందేశాలు తనకు మనోధైర్యాన్ని ఇచ్చాయని తెలిపారు. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపినవారికి, అంకితభావంతో తనకు వైద్యం అందించిన వైద్యులకు, తనకు సేవలందిస్తున్న సంరక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గురువారం ఓ ట్వీట్ చేసింది.


తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపినవారు, వైద్యులు, సంరక్షకుల పట్ల తనకు ఎంతో కృతజ్ఞతాభావం ఉందని, దానిని మాటల్లో వ్యక్తపరచడం చాలా కష్టమని రాష్ట్రపతి పేర్కొన్నట్లు రాష్ట్రపతి భవన్ ఇచ్చిన ట్వీట్ వెల్లడించింది.


రాష్ట్రపతి కోవింద్‌కు మంగళవారం ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే.  అంతకుముందు ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో హెల్త్ చెక్‌-అప్ చేయించుకున్నారు. 


Updated Date - 2021-04-01T22:55:25+05:30 IST