ఐ-టీడీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు చోటు

ABN , First Publish Date - 2021-10-19T05:33:11+05:30 IST

కాకినాడ సిటీ, అక్టోబరు 18: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఐ-టీడీపీ (డిజిటల్‌ విభాగం) రాష్ట్ర కమిటీని నియమించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు జిల్లాకు చెందిన పలువురికి నియామక ఉత్త

ఐ-టీడీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు చోటు

నియామక పత్రాలు అందజేసిన అచ్చెన్నాయుడు

కాకినాడ సిటీ, అక్టోబరు 18: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఐ-టీడీపీ (డిజిటల్‌ విభాగం) రాష్ట్ర కమిటీని నియమించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు జిల్లాకు చెందిన పలువురికి నియామక ఉత్తర్వులు అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అమలాపురం పార్లమెంటు పరిధిలోని కొత్తపేటకు చెందిన కరుటూరి రఘునందరావు చౌదరి నియమితులయ్యారు. అధికార ప్రతినిధిగా రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని నిడదవోలుకు చెందిన ఉండవల్లి అనూష, కార్యనిర్వాహక కార్యదర్శిగా కొవ్వూరుకు చెందిన కొల్లి విజయ్‌ రామ్‌భూపాల్‌, కార్యదర్శులుగా అమలాపురం పార్లమెంటు పరిధిలోని అమలాపురానికి చెందిన కట్రు శ్రీనుబాబు, మండపేటకు చెందిన ముత్యాల సబరిష్‌, రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని రాజమహేంద్రవరం రూరల్‌కు చెందిన మల్లిపూడి శ్రీను, కాకినాడ పార్లమెంటు పరిధిలోని కాకినాడ సిటీకి చెందిన అభిషేక్‌, పెద్దాపురానికి చెందిన గోలి సాయివీరేంద్ర నియమితులయ్యారు. 

Updated Date - 2021-10-19T05:33:11+05:30 IST