సివిల్స్‌ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వబోం

ABN , First Publish Date - 2021-02-25T08:40:07+05:30 IST

కరోనా కారణంగా గత ఏడాది అక్టోబరులో జరిగిన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరుకాలేక చివరి అవకాశాన్ని కోల్పోయిన అభ్యర్థులకు మరో వెసులుబాటు ఇచ్చేదిలేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

సివిల్స్‌ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వబోం

స్పష్టంచేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : కరోనా కారణంగా గత ఏడాది అక్టోబరులో జరిగిన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరుకాలేక చివరి అవకాశాన్ని కోల్పోయిన అభ్యర్థులకు మరో వెసులుబాటు ఇచ్చేదిలేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కరోనా పరిస్థితుల వల్ల పరీక్షలకు సిద్ధంకాలేకపోయామని, తమకు మరో అదనపు అవకాశం ఇవ్వాలని రచనా సింగ్‌, మరికొంతమంది సివిల్స్‌ అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించి ఈమేరకు తీర్పు చెప్పింది.  

Updated Date - 2021-02-25T08:40:07+05:30 IST