ఎలాంటి నిర్ణయమూ లేకుండానే..

ABN , First Publish Date - 2020-08-11T09:17:50+05:30 IST

చైర్మన్‌ ఎన్నిక నామినేషన్‌ ప్రక్రియే ప్రధాన ఎజెండాగా సోమవారం సమావేశమైన ఐసీసీ బోర్డు..దానిపై ఎలాంటి నిర్ణయమూ..

ఎలాంటి నిర్ణయమూ లేకుండానే..

చైర్మన్‌ ఎన్నిక అంశంపై ముగిసిన ఐసీసీ భేటీ

దుబాయ్‌: చైర్మన్‌ ఎన్నిక నామినేషన్‌ ప్రక్రియే ప్రధాన ఎజెండాగా సోమవారం సమావేశమైన ఐసీసీ బోర్డు..దానిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. శశాంక్‌ మనోహర్‌ వారసుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే విషయమై బోర్డు డైరెక్టర్లు ఏకాభిప్రాయానికి రాలేకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు సాధారణ మెజార్టీ సరిపోతుందా లేదా ప్రస్తుతం ఉన్న 2/3 వంతు మెజార్టీనే కొనసాగించాలా..అనే అంశంపై 17 మంది బోర్డు సభ్యులు భిన్నవాదనలు వినిపించినట్టు సమాచారం. ఇక బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ చైర్మన్‌ రేసులో బరిలోకి దిగుతాడా..లేదా అన్న విషయంపైనా స్పష్టత రాలేదు. 

Updated Date - 2020-08-11T09:17:50+05:30 IST