మూడో ర్యాంక్‌కు పడిపోయిన భారత్‌

ABN , First Publish Date - 2021-05-04T09:18:13+05:30 IST

సీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానం నుంచి మూడో ర్యాంక్‌కు పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో 2019 వన్డే వరల్డ్‌కప్‌ విజేత ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టిన న్యూజిలాండ్‌ 121

మూడో ర్యాంక్‌కు పడిపోయిన భారత్‌

ఐసీసీ ర్యాంకింగ్స్‌


దుబాయ్‌: ఐసీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానం నుంచి మూడో ర్యాంక్‌కు పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో 2019 వన్డే వరల్డ్‌కప్‌ విజేత ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టిన న్యూజిలాండ్‌ 121 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా రెండు స్థానాలు ఎగబాకి 118 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. టీ20ల్లో మాత్రం భారత్‌ తన రెండోస్థానాన్ని నిలబెట్టుకొంది. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ 277 పాయింట్లతో టాప్‌లో ఉండగా భారత్‌ (272), న్యూజిలాండ్‌ (272), పాకిస్థాన్‌ (261), ఆస్ట్రేలియా (258) ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. 

Updated Date - 2021-05-04T09:18:13+05:30 IST